ముంబై, జూన్ 21 : ఐసీఐసీఐ బ్యాంకు తదుపరి ఛైర్మన్గా ఎం.డి.మాల్యా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు బోర్డు జూన్ మొదటి వారంలోనే తదుపరి ఛైర్మన్గా మాల్యా పేరును ఎంపిక చేసి ఆర్బీఐ అనుమతుల కోసం పంపినట్లు తెలుస్తోంది. మాల్యా గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఛైర్మన్గా పనిచేశారు. ఆయన మే29న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఛైర్మన్ ఎం.కె.శర్మ పదవీకాలం జూన్30వ తేదీతో ముగియనుంది.
ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో మెజార్టీ సభ్యులు మాల్యాకు అనుకూలంగా ఉన్నారు. కానీ, ఆర్బీఐ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. సాధారణంగా ఇటువంటి అంశాల్లో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుతోనే ఆర్బీఐ కూడా ఏకీభవిస్తుంది. కానీ, ఆర్బీఐ నిర్ణయంలో జాప్యానికి కారణం తెలియరాలేదు. ఇప్పటికే బ్యాంకు సీఈవో చందాకొచ్చర్ సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను కొత్త సీవోవో సందీప్ బక్షికి అప్పగించిన విషయం తెలిసిందే.