'ఆర్టీవీ అన్ స్కూల్' అప్ డేట్..!!

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 05:07 PM

'ఆర్టీవీ అన్ స్కూల్' అప్ డేట్..!!

హైదరాబాద్, జూన్ 21 : సంచలన సర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. వరుసగా ప్లాప్ చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవల నాగార్జునతో తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆర్జీవీ, నాగ్ కాంబినేషన్ లో దాదాపు 20 సంవత్సరాల తర్వాత తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కాని ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారి కోసం తాజాగా ప్రవేశపెట్టిన 'ఆర్టీవీ అన్ స్కూల్' గురించి కొత్తగా సోషల్ మీడియాలో అప్ డేట్ పెట్టాడు. ఇందులో ఏమేం కోర్సులుంటాయి.. ఏమేం నేర్పుతారనే విషయాలను రివీల్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో.. 'తననందరూ సెల్యులాయిడ్ టెర్రరిస్ట్ అంటారని తనలాంటివాళ్లని మరింత మందిని తయారు చేసి సినిమా ఇండస్ట్రీ మీదకు వదులుతా' అంటూ ప్రకటించాడు. కాగా వర్మ మరో సినిమాను నిర్మించనున్నట్లు ముందుగానే వెల్లడించాడు. కన్నడ హీరో ధనుంజయ హీరోగా 'భైరవగీత' అనే ప్రేమకథ తీయబోతున్నారు.





Untitled Document
Advertisements