చెన్నై, జూన్ 22 : కోలీవుడ్ స్టార్ సూర్య, మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్లాల్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష్ కూడా నటిస్తున్నారు. కాగా ఈ భారీ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, ‘అత్తారింటికి దారేది’ ఫేం బొమాన్ ఇరానీ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంపై కోలీవుడ్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కల్యాణ్కు తాతగా నటించి బోమన్ ఇరానీ నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా.. ఆయనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే తాజాగా సూర్య , మోహన్లాల్ కలిసి నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూర్యకు 37వ చిత్రం. గతంలో కేవీ ఆనంద్ డైరక్షన్లో వచ్చిన వీడొక్కడే, బ్రదర్స్తో హిట్స్ కొట్టిన సూర్య ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.