హైదరాబాద్, జూన్ 23 : బాలీవుడ్ లో 'రేస్' సిరీస్లో వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ విజయం అందుకున్న విషయ౦ తెలిసిందే. 'రేస్', 'రేస్ 2' చిత్రాల్లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే సల్లూ భాయ్.. ఈద్ సెంటిమెంట్ తో 'రేస్-3' తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు. అనిల్ కపూర్, బాబి డియోల్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్, డైసీ షా కీలక పాత్రలు పోషించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సినిమా మాత్రం ప్లాప్ టాక్ వచ్చినా.. కలెక్ష్లన్లు మాత్రం అదిరిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీలు రాఖీ సావంత్.. అర్షీ ఖాన్ లు తమకు చెరో రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 'రేస్-3' సినిమాను తప్పకుండా చూడాలంటూ ప్రేక్షకులను కోరామని.. అంత గొప్పగా సినిమాను ప్రమోట్ చేసినందుకు తమకు డబ్బులివ్వాలంటూ చెప్పుకొచ్చారు. రాఖీ అయితే.. 'పోయేటప్పుడు డబ్బులేమన్నా పట్టుకుపోతారా? బ్యాంకులో దాచుకున్న డబ్బులు బయటకు తీసి వెళ్లి రేస్-3 చూడాలంటూ' సినిమా రిలీజ్ కు ముందు చెప్పిన మాటలను ప్రత్యేకంగా గుర్తు చేసింది. మరి ఈ విషయంపై సల్లూ భాయ్ ఏమంటారో చూడాలి మరి.