హైదరాబాద్, జూన్ 23 : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. వారాహి చలన చిత్ర బ్యానర్పై రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ నెల 24న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
విశేషమేమిటంటే.. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ వేడుకకు వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ అగ్ర హీరోలిద్దరిని ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. ఇదివరకే బాలయ్య, చిరు.. 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ఒకే వేదికపైన కనిపించారు.