ఒకే వేదికపై చిరు బాలయ్య..!!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 02:45 PM

ఒకే వేదికపై చిరు బాలయ్య..!!

హైదరాబాద్, జూన్ 23 : మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ 'విజేత' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కేకే సెంథిల్‌ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్‌ కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ నెల 24న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

విశేషమేమిటంటే.. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ వేడుకకు వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ అగ్ర హీరోలిద్దరిని ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది. ఇదివరకే బాలయ్య, చిరు.. 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ఒకే వేదికపైన కనిపించారు.





Untitled Document
Advertisements