హైదరాబాద్, జూన్ 23 : యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రానికి "గీత గోవిందం" అనే టైటిల్ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
విజయ్ నేలపై కూర్చుని కాళ్లు గోడకు అడ్డంగా పెట్టుకుని ఉంటే రష్మిక ఆయన కాళ్లపై దర్జాగా కూర్చుని నవ్వుతూ కనిపించారు. విజయ్ మాత్రం తన ప్రేయసిని చూస్తూ నవ్వుతూ కనిపించారు. నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుం నొప్పి వచ్చినా.. మీ బరువు, బాధ్యత ఎప్పుడూ నాదే మేడం" అంటూ ఈ పోస్టర్ను ట్విటర్ వేదికగా విజయ్ పంచుకున్నారు. ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తూ.. యూత్ ను ఆకట్టుకుంటున్నారు.