పవిత్ర సంగమం వద్ద విషాదం..

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 04:50 PM

పవిత్ర సంగమం వద్ద విషాదం..

విజయవాడ, జూన్ 23 : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శ‌నివారం (జూన్ 23) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో న‌లుగురు బీటెక్ విద్యార్ధులు . వీరంతా కంచికచర్లలో మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నలుగురిలో ఒకరు స్నానం చేయడానికి నీటిలో దిగగా అదుపు తప్పి లోపలికి ప‌డిపోయాడు.

ఈనేప‌థ్యంలో అతడిని కాపాడే ప్రయత్నం చేసిన ముగ్గురు విద్యార్ధులు కూడా గల్లంతు అయ్యారు. గ‌ల్లంతై విద్యార్ధులను ప్రవీణ్ (18) ,చైతన్య (18) శ్రీనాథ్ (19)రాజ్ కుమార్ (19)గా గుర్తించారు. వీరికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements