షూటింగ్ లో గాయపడ్డ ధనుష్..!!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 05:27 PM

షూటింగ్ లో గాయపడ్డ ధనుష్..!!

చెన్నై, జూన్ 23 : తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మారి 2'. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ధనుష్ తదితరులపై చిత్ర యూనిట్ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ప్రమాదం సంభవించి ధనుష్‌ కుడి కాలికి, ఎడమ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

దర్శకుడు బాలాజీ మోహన్ పేకప్ చెప్పేద్దామని అన్నప్పటికీ, మిగతా ఆర్టిస్టుల డేట్స్ దొరకడం ఇబ్బంది అవుతుందంటూ ధనుష్ షూటింగులో పాల్గొన్నారట. ఆయన ఆ సీన్ ను పూర్తి చేసి.. యూనిట్ సభ్యుల నుంచి అభినందనలు అందుకున్నారట. ధనుష్ కు గాయమైన సమాచారంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ధనుష్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో సందేశాలు పెట్టారు. దీంతో స్పందించిన ధనుష్.. ట్విట్టర్ వేదికగా "నా ప్రియమైన అభిమానులారా.. నేను బాగున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుడిని, మీరే నా బలం" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు అభిమానులు కాస్త ఊరట చెందారు.





Untitled Document
Advertisements