మాస్కో, జూన్ 26 : రష్యా వేదికగా జరుగుతున్నా ఫిఫా ప్రపంచ కప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. తుది-16లో చోటు దక్కించుకునేందుకు జట్ల మధ్య పోటీ ఎక్కువైంది. దీంతో కొన్ని మ్యాచ్లు చివరి నిమిషం వరకు ఉత్కంఠంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మ్యాచ్ ఫలితాలను బట్టి గ్రూప్-బి నుంచి.. స్పెయిన్, పోర్చుగల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్కు అర్హత సాధించాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇరాన్-పోర్చుగల్, స్పెయిన్-మొరాకో మధ్య జరిగిన రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
ఎక్సట్రా ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసి పోర్చుగల్తో మ్యాచ్ను ఇరాన్ డ్రాగా ముగించింది. మరో మ్యాచ్లో మొరాకోతో జరిగిన మ్యాచ్ను స్పెయిన్ 2-2తో డ్రా చేసింది. దీంతో గ్రూప్ దశలో ఒక్క విజయం సాధించని మొరాకోతో పాటు పోర్చుగల్తో మ్యాచ్ను డ్రా చేసుకున్న ఇరాన్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి సౌదీ ఆరేబియా, ఈజిప్ట్ జట్లు టోర్నీ నుంచి వైదొలిగాయి.