డబ్లిన్, జూన్ 28 : టీమిండియా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో 'ఇంగ్లిష్' పర్యటనను ఘనంగా ఆరంభించింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తుగా ఓడించింది. తొలుత టాస్ నెగ్గిన ఐర్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాలో ఓపెనర్లు రోహిత్ శర్మ (97; 61 బంతుల్లో 8×4, 5×6), శిఖర్ ధావన్ (74; 45 బంతుల్లో 5×4, 5×6) విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లతో జోరుతో మొదట భారత్ 5 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తర్వాత భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ జట్టు భారత్ బౌలర్లు ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38), బుమ్రా (2/19) రాణించారు. జేమ్స్ షెనాన్ (35 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడం మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్కు దక్కింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 ఈనెల 29న (శుక్రవారం) జరగనుంది.