సచిన్ సరికొత్త సవాల్..

     Written by : smtv Desk | Thu, Jun 28, 2018, 03:52 PM

సచిన్ సరికొత్త సవాల్..

ముంబై, జూన్ 28 : 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' పేరుతో కేంద్ర క్రీడల శాఖా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్ రాథోడ్ ప్రజలకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్ ను విసిరిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ ఎంతో పాపులర్ అయ్యిందో వేరే చెప్పక్కరలేదు. దాన్ని మన క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలు, మన దేశ ప్రధాని కూడా స్వీకరించి కసరత్తులు చేస్తోన్న వీడియోలను పోస్ట్‌ చేశారు. తాజాగా అలాంటి ఛాలెంజ్‌తోనే క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ ముందుకొచ్చారు. దీనిపేరు 'కిట్ అప్‌ ఛాలెంజ్'‌. దీన్ని స్వీకరించిన వారు తమకిష్టమైన ఆట ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయాలి. భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్‌, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లీ పేర్లను ట్యాగ్ చేసి వారికి ఈ ఛాలెంజ్‌ విసిరారు.

"నాకు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడటం అంటే ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ రాథోడ్ ఛాలెంజ్‌కు పొడిగింపుగా ఉంటుంది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఆయన వెల్లడించారు. "నేను నాకు ఇష్టమైన క్రికెట్ ఆడి వీడియోను షేర్‌ చేశాను. మీరు మీకిష్టమైన ఆట ఆడి మీరు మీ వీడియోలను షేర్‌ చేయండి. మీరందరు ఎప్పుడు ఫిట్ గా ఉండాలనుకుంటున్నాను" అని సచిన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.







Untitled Document
Advertisements