ఢిల్లీ, జూలై 1 : టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విసిరిన ఛాలెంజ్ను విరాట్ కోహ్లీ స్వీకరించాడు. మూడు రోజుల క్రితం సచిన్ 'కిట్ అప్ ఇండియా' పేరిట ఒక ఛాలెంజ్ ప్రారంభించాడు. దీన్ని స్వీకరించిన వారు తమకిష్టమైన ఆట ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేయాలి. భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లీ పేర్లను ట్యాగ్ చేసి వారికి ఈ ఛాలెంజ్ ను సచిన్ విసిరారు.
తాజాగా సచిన్ విసిరిన ఈ సవాలును కోహ్లీ స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లీ తన ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. తదుపరి పార్దీవ్ పటేల్ ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరాడు. అయితే కోహ్లీ ఈ వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కిట్ను ధరించాడు. ఎరుపురంగు కాలి ప్యాడ్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే సమయంలో వాడే హెల్మెట్ను కోహ్లీ పెట్టుకున్నాడు. ఐర్లాండ్లో కోహ్లీ సేన పర్యటన ముగిసింది. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
A post shared by Virat Kohli (@virat.kohli) on