అది అవాస్తవం.. నాకే జోతిష్కుడు చెప్పలేదు..

     Written by : smtv Desk | Thu, Jul 05, 2018, 06:43 PM

అది అవాస్తవం.. నాకే జోతిష్కుడు చెప్పలేదు..

బెంగళూరు, జూలై 5 : కర్ణాటక ముఖ్యమంత్రి సోదరుడు రేవన్న జోతిష్కుడు సలహా మేరకే ప్రతి రోజు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వచ్చిన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆయన.. అదంతా అబద్దమని.. తనకింకా ప్రభుత్వ వసతి ఏర్పాటు కానందువల్లే హోలెనరసిపుర నుంచి బెంగళూరు వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. 'రోజుకు 350 కిలో మీటర్లు ప్రయాణించమని నాకు ఏ జోతిష్కుడు చెప్పలేదు. ప్రభుత్వం ఇంకా అధికారిక భవనం ఇవ్వలేదు. అందుకే నేను రోజూ ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి పని చేసుకునేందుకు వెళ్తున్నాను" అని రేవన్న స్పష్టం చేశారు.

రేవన్న బెంగళూరులోని తన సొంతింట్లో రాత్రిళ్లు నిద్రపోవడం మంచిది కాదని, అలా చేస్తే చెడు జరుగుతుందని ఆయనకు ఓ జోతిష్కుడు చెప్పాడని.. అందుకే ఆయన రోజు 350కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయనకు కేటాయించాల్సిన భవనంలో ప్రస్తుతం మాజీ పీడబ్ల్యూడీ మంత్రి హెచ్‌సీ.మహదేవప్ప ఉంటున్నారు. మహాదేవప్ప ఇంటిని ఖాళీ చేసేందుకు కనీసం మూడు నెలలు సమయం పడుతుంది. అందుకే రేవన్న అంత దూరం ప్రయాణం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.





Untitled Document
Advertisements