తమిళనాడులో ఘోరం..

     Written by : smtv Desk | Fri, Jul 06, 2018, 12:15 PM

తమిళనాడులో ఘోరం..

చెన్నై, జూలై 6 : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అక్కడ ఉన్న స్థానికులు ఒక మహిళని తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా దగ్గరకి కూడా రాలేదు.

ఆ మహిళా ఆర్తనాదాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు. అతను పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మదీశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది.






Untitled Document
Advertisements