అమరావతి, జూలై 7 : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీజేపీ నేత రాంమాధవ్ పై ట్వీటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు చావుదెబ్బ తగిలినందుకే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోందని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోకపోవడమే మోదీ పాపులారిటీ పెరిగిందనడానికి నిదర్శనం అంటూ రాంమాధవ్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్.. ధీటైన జవాబు ఇచ్చారు. ఒకవేళ మోదీకి నిజంగానే జనాదరణ ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీకి చావుదెబ్బ తగలిందని విమర్శించారు. అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలంటూ తొందర పడుతున్నారని లోకేశ్ అన్నారు. ఇదేనా మోదీ పాపులారిటీ అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతల ట్వీట్లకు మంత్రి లోకేష్ సూటిగా కౌంటర్లు ఇస్తున్నారు. విభజన హామీలపైనా... కమలనాథులు చేసే కామెంట్లపైనా.. ఇప్పుడు జమిలి ఎన్నికలపైనా ట్విట్టర్ వేదికగా జవాబిచ్చారు.
BJP failed to win the mandate in Karnataka, and is staring down the barrel in other states that are set to go for elections this year, hence the talk of simultaneous polls. Call this Modi's popularity? https://t.co/t5M4fQaoGx
— Lokesh Nara (@naralokesh) July 7, 2018