కాంగ్రెస్ లోకి నల్లారి.. ముహూర్తం ఖరారు..

     Written by : smtv Desk | Mon, Jul 09, 2018, 01:37 PM

కాంగ్రెస్ లోకి నల్లారి.. ముహూర్తం ఖరారు..

అమరావతి, జూలై 9 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. గత కొన్ని రోజులుగా ఆయన సొంత గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై స్పందించిన ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ధ్రువీకరించారు.

బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చాందీకి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాందీ మాట్లాడుతూ.. ఈనెల 13న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరనున్నారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం నెలాఖరు వరకు 13 జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహించనున్నట్లు ఊమెన్‌ చాందీ తెలిపారు.





Untitled Document
Advertisements