నిర్లక్ష్యానికి.. నిండు ప్రాణం బలి..

     Written by : smtv Desk | Wed, Jul 11, 2018, 12:34 PM

నిర్లక్ష్యానికి.. నిండు ప్రాణం బలి..

బహదూర్‌పురా, జూలై 11 : 'చరవాణి మాట్లాడుతూ వాహనాలు డ్రైవింగ్ చేయరాదు'..'హెల్మెట్ లేకుండా వాహనం నడుపరాదు' అని ఎంత మంది చెప్పిన, ప్రభుత్వాలు అవగాహనా కల్పించిన కొంత మందిలో మార్పులు రావడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. బహదూర్‌పురా నాలా వద్ద చరవాణిలో మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్తున్న ఖాజా మోహినుద్దీన్(35) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు.

చరవాణి మాట్లాడుతూ రాంగ్‌రూట్‌‌లో వెళ్తున్న మోహినుద్దీన్‌ను మరో బైక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తలకి బలమైన గాయం కావడంతో ఖాజా మోహినుద్దీన్ బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందాడని.. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై శివకుమార్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.





Untitled Document
Advertisements