టుడే.. వ‌ర‌ల్డ్ పాప్యులేష‌న్ డే..

     Written by : smtv Desk | Wed, Jul 11, 2018, 01:49 PM

టుడే.. వ‌ర‌ల్డ్ పాప్యులేష‌న్ డే..

ఢిల్లీ, జూలై 11 : పెరుగుతున్న జనాభా.. కోరవడుతున్న అవసరాలు.. ఎంచేయాలో పాలుపోని ప్రభుత్వాలు.. . ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదిక ప్రకారం ఈ శతాబ్ధానికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటుందని అంచనా. రోజు రోజుకు పెరుగిపోతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఏటా జులై 11 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన విషయాలుపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 1989లో దీనిని ప్రారంభించింది.

11-07- 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువలన నాటి నుండి జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. వ‌ర‌ల్డ్ పాప్యులేష‌న్ డే 2018 సంద‌ర్భంగా కుటుంబ నియంత్ర‌ణ‌(ఫ్యామిలీ ప్లానింగ్) అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. కుటుంబ నియంత్ర‌ణ అనేది మాన‌వ హ‌క్కు. కుటుంబ నియంత్ర‌ణ చ‌ట్టం చేసి 50 ఏళ్లు అయిన సంద‌ర్భంగా ఇది ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌హిళ‌లు, బాలిక‌లు ఎంత మందిని క‌నాలి అనే దానిలో స్వేచ్ఛ వారికే ఉంటుంది.

ఈ ఇనిషియేటివ్ ప్ర‌ధాన ఉద్దేశం పున‌రుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌, ఆరోగ్య స‌మ‌స్య‌లు వంటి వాటిపై ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌డం. గ‌ణంకాల ప్ర‌కారం ప్ర‌స‌వ‌ స‌మ‌యంలో ప్ర‌తి రోజూ 800 మంది త‌ల్లులు మ‌ర‌ణిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త‌దేశ జ‌నాభా 135.41 కోట్లుగా(2018,జులై నాటికి) ఉంది. మొత్తం ప్రపంచ జ‌నాభాలో మ‌న దేశ జ‌నాభా 17.7%. చైనా త‌ర్వాత రెండో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశం మ‌న‌ది. ఇదే రీతిన జ‌నాభా కొన‌సాగితే దేశంలో వ‌న‌రులపై విప‌రీత‌మైన ఒత్తిడి పెరుగుతుంది.





Untitled Document
Advertisements