విశాల్ తో 'టెంపర్' రీమేక్..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 01:43 PM

విశాల్ తో 'టెంపర్' రీమేక్..

హైదరాబాద్, జూలై 14 : ప్రముఖ హీరో విశాల్.. 'సెండై కోళి 2'('పందెంకోడి 2 ')తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'సెండై కోళి'(పందెం కోడి). ఈ చిత్రానికి సీక్వెల్ గా 'సెండై కోళి 2' రానుంది. ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో విశాల్ వున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను 'ఠాగూర్' మధు దక్కించుకున్నారు. శాటిలైట్ హక్కులు.. తెలుగు వెర్షన్ హక్కులను కలుపుకుని దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'టెంపర్' భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత 'ఠాగూర్' మధు.. విశాల్ హీరోగా ఈ సినిమాను తమిళంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements