హైదరాబాద్, జూలై 14 : విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'RX 100' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటించారు. రాంకీ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'అర్జున్రెడ్డి' మూవీ తరహాలో విడుదలకు ముందే అంచనాలను పెంచింది. దాంతో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ సినిమా చూసేందుకు యువత థియేటర్ల వద్ద బారులు తీరింది.
ఈ నేపథ్యంలో తొలి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దాదాపు కోటీ యాభై లక్షల రూపాయల షేర్ సాధించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తన వద్ద శిక్షణ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతిను రామ్ గోపాల్ వర్మ అభినందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ లో "'RX 100’ విజృంభిస్తోంది. నన్ను తన తర్వాతి చిత్రానికి అసిస్టెంట్గా పెట్టుకోమని నా మాజీ అసిస్టెంట్ అజయ్ భూపతిని కోరుతున్నాను" అంటూ వర్మ పరోక్షంగా ఆయన్ను అభినందించారు.