నిర్మాతగా సక్సెస్‌ సాధించాలి : వంశీ పైడిపల్లి

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 04:20 PM

నిర్మాతగా సక్సెస్‌ సాధించాలి : వంశీ పైడిపల్లి

హైదరాబాద్, జూలై 14 : యంగ్ హీరో సుధీర్ బాబు, నభా నటాష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్‌ను స్టీలర్‌ పేరుతో రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా ఈ ఈ టీజర్‌ చూసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ మేరకు ట్విట్టర్ లో.. "టీజర్‌ చాలా బాగుందిరా. సమ్మోహనం సినిమాలానే ఇది కూడా మళ్లీ హిట్‌ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా సక్సెస్‌ సాధించాలి. ఆల్‌ ది బెస్ట్‌" అంటూ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌ బాబు టిపికల్‌ మెంటాలిటీ ఉన్న మేనేజర్‌ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్‌ నభా నటేష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణా౦తర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements