తూర్పుగోదావరి లో పడవ బోల్తా..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 05:34 PM

 తూర్పుగోదావరి లో పడవ బోల్తా..

రాజమహేంద్రవరం, జూలై 14 : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది గల్లంతైనట్టు సమాచారం. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు 30 మందితో బయల్దేరిన నాటు పడవ నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లలర్‌కు తగలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులంతా పదో తరగతి లోపువారేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటికే 26మందిని గ్రామస్థులు కాపాడగా.. గల్లంతైనవారి వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని సమీక్షిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements