500 కోట్ల క్లబ్బులో 'సంజు'..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 11:19 AM

500 కోట్ల క్లబ్బులో 'సంజు'..

హైదరాబాద్, జూలై 15 : ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా వచ్చిన 'సంజు' సినిమా బాక్సాఫీసు వద్ద సునామీలా దూసుకుపోతుంది. అత్యంత భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా తాజాగా "బాహుబలి-2" నెలకొల్పిన రికార్డును అధిగమించింది. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సరికొత్త విక్టరీ సాధించింది. ఈ విషయం తెలుపుతూ తాజాగా సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌, మనీషా కొయిరాలా, పరేశ్‌ రావల్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలూ సమకూర్చారు. ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడంతో పాటు అత్యంత భారీ వసూళ్లను రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. అంతేకాదు రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనర్‌గా కూడా నిలిచి రికార్డు సృష్టించింది.





Untitled Document
Advertisements