హైదరాబాద్, జూలై 15 : టాలీవుడ్ లో కుటుంబ కథ చిత్రాలకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. కథ, కథనంలో కాస్తా వైవిద్యత చూపిస్తూ.. కుటుంబ అనురాగాలు, ఆప్యాయతలను జోడించి సినిమా తీస్తే హిట్ కొట్టడం గ్యారంటీ. గతంలో వెంకటేష్ నటించిన 'సంక్రాంతి' నుండి ఇటీవల వచ్చిన 'శతమానం భవతి' చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్లుగా మంచి విజయం అందుకున్నాయి. తాజాగా అదే కోవలో ప్రముఖ కథానాయకుడు కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం 'చినబాబు'. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదలై మంచి టాక్ ను దక్కించుకొంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కించిన కథ ఇది. దర్శకుడు రైతు కష్టాలను సున్నితంగా చర్చిస్తూనే ఒక ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, అలకలు, కోపాల్ని తెరపై చక్కగా చూపించారు దర్శకుడు. ఆ తర్వాత అంతటి స్థాయిలో విజయం సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో కార్తికి జోడీగా సాయేషా సైగల్ నటించారు. కార్తి సోదరుడు సూర్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.