ముంబై, జూలై 15 : కథానాయికలు హీరోలకు సమానంగా పారితోషికం కావాలంటూ ఎప్పట్నుంచో గట్టిగానే వాదిస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే పలువురు నాయికలు సైతం గళం విప్పారు. తాజాగా బాలీవుడ్ భామలు ఇప్పుడు ఒకడుగు ముందుకేసి ఏకంగా సినిమా లాభాల్లో వాటా కూడా కోరుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. 'పద్మావత్' సినిమా కోసం లాభాల్లో వాటా కోరినట్లు తెలిసింది. ఆ మధ్య దీపిక పదుకొనే కూడా లాభాల్లో వాటా కోరినట్లు సమాచారం.
'పద్మావత్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీపిక, ప్రియాంక లాభాల్లో వాటాలు కోరినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా హాలీవుడ్లో బిజీగా ఉన్న ప్రియాంక ఈ మధ్య హిందీలో వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. ఈ మధ్యే ప్రియాంక.. 'ది స్కై ఈజ్ పింక్' చిత్రాన్ని అంగీకరించారు. మోటివేషనల్ స్పీకర్ అయేషా చౌదరీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.