హైదరాబాద్, జూలై 15 : ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ కలిసి నటిస్తున్న చిత్రం "నీవెవరో". హరినాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
'రెండు ప్రేమకథలు.. ఒక్క సంఘటన' అంటూ ఆది వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభం అవుతుంది. 'ఈ ప్రపంచంలో ప్రతీ సమస్యకు సమాధానం.. ఏదో ఒక రూపంలో వస్తుంది. నాకే రూపంలో వస్తుందో చూడాలి' అంటూ ఆది చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే 'మీరు స్కెచ్ వేసి చంపింది అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్.. కిమ్మైనా.. ట్రంపైనా లోపలేసి కుమ్ముతా' అంటూ వెన్నెల కిషోర్ పండించే కామెడీ హాస్యాస్పదంగా ఉంది.