హైదరాబాద్, జూలై 16 : టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్.. యూత్ ఐకాన్ ఎవరు అంటే.. టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం 'ట్యాక్సీ వాలా', 'నోటా', 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' లాంటి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే అభిమానుల కోసం విజయ్ సొంత దుస్తుల బ్రాండ్ 'రౌడీ క్లబ్' అనే పేరుతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును కొనుగోలు చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో నటనకు గాను విజయ్.. ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఆ అవార్డును వేలం వేసి సీఎం రిలీప్ ఫండ్ కు ఇస్తానని ఇదివరకే ప్రకటించాడు. అయితే, ఇప్పుడా అవార్డును వేలం వేసే పనిలేకుండా 'దివీస్ లేబొరేటరీస్' సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత కిరణ్ సతీమణి శకుంతల ఈ అవార్డుకు రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. విశేషమేమిటంటే.. ఆ అవార్డును కొనుగోలు చేసిన అనంతరం శకుంతల.. ఆ అవార్డును తిరిగి హీరో విజయ్ దేవరకొండకే అందించగా.. అతను సున్నితంగా తిరస్కరించాడు.