హైదరాబాద్, జూలై 16 : విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'RX 100' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటించారు. రాంకీ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది.
రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ఫస్టు వీకెండ్ లోనే రెట్టింపు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ తెగ పోటీపడుతున్నాయట. దీంతో నిర్మాత.. 6 కోట్ల వరకు చెబుతున్నాడట. ఈ సినిమాకు మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉండడంతో కాస్త అటు ఇటుగా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఎవరికి దక్కుతాయో.. ఎంతకీ అమ్ముడవుతాయో చూడాలి మరి.