హైదరాబాద్, జూలై 16 : యువ హీరో రాజ్ తరుణ్.. అనీష్ కృష్ణ కాంబినేషన్ లో 'లవర్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. మంచి ప్రేమకథాంశంతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా 'రిద్ధి కుమార్' కథానాయికగా పరిచయమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్టులుక్, మోషన్ పోస్టర్ లు ఆకట్టుకున్నాయి. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలతో రాజ్తరుణ్ కొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో బిజీబిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే వరుస పరాజయాలతో ఉన్న రాజ్ తరుణ్ తన ఆశలన్ని ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమాను జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.