'నన్ను దోచుకుందువటే' రిలీజ్ డేట్ ఫిక్స్..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 03:16 PM

'నన్ను దోచుకుందువటే' రిలీజ్ డేట్ ఫిక్స్..

హైదరాబాద్, జూలై 16 : యంగ్ హీరో సుధీర్ బాబు, నభా నటాష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో సుధీర్‌ బాబు టిపికల్‌ మెంటాలిటీ ఉన్న మేనేజర్‌ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్‌ నభా నటేష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇటీవల 'సమ్మోహనం' చిత్ర విజయంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ హీరో సుధీర్ బాబు.. మరో ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు.





Untitled Document
Advertisements