హైదరాబాద్, జూలై 16 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సరైనోడు' సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకొంది. 2016లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూ.50కోట్ల బడ్జెట్తో ‘సరైనోడు’ను తెరకెక్కించారు. రకుల్ ప్రీత్సింగ్, కేథరిన్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.127కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సాధించింది. ఈ చిత్ర హిందీ వెర్షన్ను యూట్యూబ్లో రెండు కోట్లమందికిపైగా వీక్షించారు. యూట్యూబ్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ‘సరైనోడు’ కావడం విశేషం.
ఈ చిత్ర హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్మైన్స్ టెలీఫిల్మ్స్ దక్కించుకుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని 200,635,52మంది వీక్షించగా, ఆరు లక్షలమందికి పైగా లైక్ చేశారు. గతంలో ఏ భారతీయ చిత్రమూ సాధించని రికార్డును ‘సరైనోడు’ సొంతం చేసుకుంది. పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ యాంగ్రీమెన్గా గణ అనే పాత్రలో కనిపించారు. ప్రతినాయకుడిగా ఆది కూడా హీరో పాత్రతో దీటుగా అలరించాడు.