హైదరాబాద్, జూలై 17 : తమిళ కథానాయకుడు కార్తి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 'నా పేరు శివ', 'ఆవారా' సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. కింగ్ నాగార్జున తో 'ఊపిరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువై.. 'ఖాకీ' సినిమాతో హిట్కొట్టి మంచి ఫామ్లోకి వచ్చాడు. తాజాగాఆయన 'చినబాబు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించారు. కుటుంబ కథా, రైతు, గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో సూర్య నిర్మించారు.
ఈ సినిమా యూనిట్ సక్సెస్మీట్లు నిర్వహిస్తూ ఉంది. వీటికి హాజరయ్యేందుకు విచ్చేస్తోన్న కార్తీ.. ట్రాఫిక్, వర్షం కారణంగా ఆలస్యమవుతుండటంతో.. ఏమాత్రం ఆలోచించకుండా ఆటోలో కార్యక్రమానికి వచ్చాడు. కార్తీ అలా రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కార్తి కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలను బాగానే చూపించారు. కార్తి తొలిసారి పూర్తిస్థాయి రైతు పాత్రలో కనిపించి అలరించారు.