ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే..

     Written by : smtv Desk | Tue, Jul 17, 2018, 11:26 AM

ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే..

హైదరాబాద్, జూలై 17 : 'మహానటి' సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరి చేత అద్భుతం అనిపించిన కథానాయిక కీర్తిసురేష్. ఆ పాత్రకు కీర్తిని తప్ప వేరే వ్యక్తిని ఊహించలేము అనేంతలా తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'మహానటి' సినిమాతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఆమె పేరు మార్మోగుతోంది. విమర్శకులను సైతం మెప్పించిన కీర్తీసురేశ్‌ మరోసారి సావిత్రి పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్' సినిమాలో సావిత్రి పాత్రకు దర్శకుడు క్రిష్‌ కీర్తీసురేశ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కీర్తికి ఆఫర్లు వరుస కడుతున్నాయట. దీంతో ఆమె పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన కీర్తి.. "డబ్బు సంపాదించాలనే ధ్యాసతో నటించడానికి పరిశ్రమలోకి రాలేదు. మంచి కథ ఉన్న చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్న ఉద్దేశంతో వచ్చాను. ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం అదే. దాని వైపే నా పయనం సాగుతోంది. శ్రమకు తగిన ఫలితాన్నే నేను కోరుకుంటా. పారితోషికం కన్నా నటనకే ప్రాధాన్యత ఇస్తా" అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.





Untitled Document
Advertisements