హైదరాబాద్, జూలై 18 : అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్రను పోషించనున్నారు. అలాగే రణ్బీర్కపూర్, అలియా భట్లు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ బుల్లితెర నటి మౌనీ రాయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే తాజాగా షూటింగ్ లో పాల్గొన్న ఈ భామ.. నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో.. "షూటింగ్ చాలా ప్రశాంతంగా, గొప్పగా ఉంది. నాగ్ ఎంత గొప్ప వ్యక్తో.." అని ట్వీట్ చేశారు. బల్గేరియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ్కు జోడీగా బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.