అబుదాబి, జూలై 18 : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తే ఎవరైనా ఫోటోలు దిగాలని చూస్తారు. లేదంటే ఆయనను కలిసి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చూస్తుంటారు. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా సల్మాన్ ను ఎవరు గుర్తుపట్టకపోవడం గమనార్హం. ఆయన ఒక సాధారణ వ్యక్తిలా అక్కడ కూర్చొని ఫోన్ చూస్తూ ఉండిపోయారు. అసలు విషయం ఏంటంటే.. సల్మాన్ ఇటీవల అబుదాబికి వెళ్లారు. అక్కడి ఓ లగ్జరీ మాల్కు సల్మాన్ తన బాడీగార్డ్స్తో కలిసి వెళ్ళిన ఆయన అక్కడే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు.
కానీ ఆయనను అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు. ఈ మాల్లో ఉన్న ఓ వ్యక్తి సల్మాన్ వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ వీడియో కు తెగ కామెంట్లు పెడుతున్నారు. 'సల్మాన్ ను అందరు మర్చిపోయారేమో' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా సల్మాన్ ఇటీవల 'రేస్ 3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించి 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
A post shared by Bollywood (@filmyhaiboss) on