ముంబై, జూలై 18 : బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్.. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులోనే ఉంటారు. ఆయన తాజాగా తన కూతురితో కలిసి ఒక ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో కూడా అమితాబ్.. ఆయన కూతురు శ్వేతా ఇద్దరు తండ్రి కూతుళ్లుగానే నటించారు.
ఈ మేరకు అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్ అభిమానుల మనసు దోచుకుంటుంది. కుమార్తెలు ఉండడం మంచిదే. అంటూ ఒక భావోద్వేగపు పోస్ట్ పెట్టారు. ఈ మేరకు బిగ్ బీ తన ట్విటర్లో.. 'టీ 2870 నాకు చాలా భావోద్వేగమైన సమయం. దీన్ని చూసిన ప్రతిసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లు బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
T 2870 - Emotional moment for me .. tears welling up every time I see it .. daughters are the BEST !! pic.twitter.com/7Jes2GDPBo
— Amitabh Bachchan (@SrBachchan) July 17, 2018