ఆయన ప్రశంసల్ని గౌరవంగా భావిస్తున్నా..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 01:14 PM

ఆయన ప్రశంసల్ని గౌరవంగా భావిస్తున్నా..

హైదరాబాద్, జూలై 18 : యువ కథానాయకుడు కార్తి.. 'చినబాబు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కార్తి తొలిసారి పూర్తిస్థాయి రైతు పాత్రలో కనిపించి అలరించారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేసిన ఈ చిత్రం ఘన విజయ సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ సభను నిర్వహించింది.

ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. "చిన్న కుటుంబాలు పెరుగుతున్న ఈ రోజుల్లో... 'చినబాబు' చూసిన ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ఈ చిత్రాన్నీ, మమ్మల్నీ అభినందిస్తూ ట్వీట్స్‌ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ప్రశంసించడం వల్ల మేము ఏ నమ్మకంతో ఈ చిత్రం చేశామో.. అది ఇంకా పెరిగింది. ఆయన ప్రశంసల్ని గౌరవంగా భావిస్తున్నాం" అంటూ పేర్కొన్నారు. అలాగే దర్శకుడు మిరియాల రవీందర్ మాట్లాడుతూ.. 'ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బిజీ షెడ్యూల్‌లో సినిమా చూసి ట్వీట్‌ చేయడం సంతోషంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements