బయోపిక్ లో నటించనున్న 'భరత్' భామ..!!

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 02:31 PM

బయోపిక్ లో నటించనున్న 'భరత్' భామ..!!

హైదరాబాద్, జూలై 18 : 'భరత్‌ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భామ కైరా అద్వానీ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. గతంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోని జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని' చిత్రంలో నటించిన కైరాకి ఆ చిత్రంతో మంచి పేరొచ్చింది. తాజాగా ఈ అమ్మడుకి మరో బయోపిక్ లో అవకాశం లభించింది.

పరమ వీర చక్ర అవార్డు గెలుచుకున్న అమర జవాన్ విక్రమ్ బాత్రా జీవిత కథతో రూపొందించే చిత్రంలో హీరోయిన్ గా కైరాను ఎంపిక చేసుకున్నారు. సిద్ధార్త్ మల్హోత్రా హీరోగా నటించే ఈ చిత్రానికి కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బోయపాటి శ్రీను.. రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రంలో నటిస్తోంది. కాగా ఇటీవల హిందీలో రిలీజైన 'లస్ట్ స్టోరీస్' లో ఆమె నటించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. దీంతో తను ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలనని నిరూపించింది. దీంతో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.





Untitled Document
Advertisements