హైదరాబాద్, జూలై 18 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు మంగళవారం కూడా 'కారు'లో పెద్ద ఎత్తున చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ప్రధాన అనుచరుడు, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు మర్ల చంద్రారెడ్డి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఈయనతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబాయికి చెందిన వంద కుటుంబాల వారు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో, మహబూబ్నగర్ మండలం పోతన్పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజామూర్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 50 మంది నాయకులు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల నుంచి 150 మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ క్రిష్టాపురంలో సుమారు 50 కుటుంబాల వారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.