అగ్రస్థానం మరింత మెరుగుపరుచుకున్న కోహ్లి..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 06:35 PM

అగ్రస్థానం మరింత మెరుగుపరుచుకున్న కోహ్లి..

దుబాయ్‌, జూలై 19 : టీమిండియా క్రికెట్ సారథి విరాట్‌ కోహ్ల వన్డేల్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిల పరుచుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యధికంగా 911 పాయింట్లకు చేరుకున్నాడు. 1991లో డీన్‌జోన్స్‌ 918 పాయింట్లకు చేరుకున్న తర్వాత వన్డేల్లో ఓ బ్యాట్స్‌మన్‌ అత్యధికంగా సాధించిన పాయింట్లు ఇవే. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లి వరుసగా 75, 45, 71 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రెండు శతకాలు చేసిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ (819) కెరీర్‌లోనే అత్యుత్తమంగా రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ కెరీర్‌లో తొలిసారి టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. అతడు ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానం సాధించాడు. బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్‌ పదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ మొదటి స్థానంలో నిలిచాడు.





Untitled Document
Advertisements