హైదరాబాద్, జూలై 20 : మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ నెల 25న హైదరాబాద్లో 'కైరళి పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల ప్రదానోత్సవం' జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు మమ్ముట్టి తాజాగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ను కలిసి, కాసేపు మాట్లాడారు. ఈ పురస్కార ప్రదానోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కేటీఆర్ను సూపర్స్టార్ కోరారు. ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. 'కైరళి పీపుల్ ఇన్నోటెక్ పురస్కారాల ప్రదానోత్సవం' కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు. అంతేకాదు కేటీఆర్కు మమ్ముట్టి మొక్కను బహుమతిగా ఇచ్చారు.
తెలుగులో మమ్ముట్టి 'స్వాతి కిరణం', 'సూర్య పుత్రులు', 'రైల్వే కూలీ' చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో నటిస్తున్న చిత్రం 'యాత్ర'. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.