టెలికం రంగంలో అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన జియో... ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లతో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు... తన పాత కస్టమర్లకు సరికొత్త ఆఫర్లు ఇస్తూ వస్తుంది.రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.99 కే అన్లిమిటెడ్ కాల్స్తో పాటు.. 14 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.
కేవలం రూ.99 రీఛార్జ్ ప్యాక్తో 14 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. 28 రోజు కాలపరిమితో ఉండే ఈ ఆఫర్ కింది రోజుకు 0.5 జీబీ చొప్పు మొత్తం 14 జీబీ డేటాను ఇవ్వనుంది.
అలాగే, ఉచితంగా 300 ఎస్ఎంఎస్లకు కూడా అవకాశం ఉంది. అయితే ఇది కేవలం జియో ఫోన్లలో వాడే సిమ్కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో రూ.99 ఆఫర్ దాని మాన్సూన్ హంగామా ఆఫర్తో పాటు ఆవిష్కరించింది. అలాగే పాత జియోఫోన్ లు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్లు రూ.594 రీఛార్జ్ చేసుకుంటే ఆరు నెలలపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా పొందుతారు.