మోదీ ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి

     Written by : smtv Desk | Sun, Jul 22, 2018, 05:23 PM

మోదీ ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ప్రసంగం అయిపోయిన తర్వాత అనూహ్యంగా ప్రధాని వద్దకు వెళ్లి ఆయనకు హగ్ ఇవ్వడం సెన్సేషన్ గా మారింది. రాహుల్ వైఖరిపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.

లోక్ సభలో జరిగిన ఘటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఘాటుగా స్పందించారు. మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హగ్ చేసుకున్న ఘటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇబ్బంది కలిగే విధంగా రాహుల్ ప్రవర్తించారని అన్నారు.

పార్లమెంటు లోపల ప్రధానికి ఉన్న రక్షణ గురించి ఈ ఘటన ఏం చెబుతుందని ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది అనైతిక చర్య అని, ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తన ప్రసంగాన్ని ముగించిన రాహుల్ గాంధీ... నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి, ఆయనను ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements