గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

     Written by : smtv Desk | Sun, Jul 22, 2018, 05:59 PM

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ఆదివారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. ఆగస్టు 15న ప్రారంభమయ్యే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపైనా వీరిద్దరూ చర్చించారు. ఇటీవలి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, తెరాస వైఖరి, ప్రధాని వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.





Untitled Document
Advertisements