2015 నాటి అల్లర్ల కేసులో పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ను గుజరాత్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. విస్నగర్లోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో హార్దిక్తోపాటు ఆయన అనుచరులు లాల్జి పటేల్, ఏకే పటేల్లను కోర్టు దోషులుగా తేల్చింది
మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో హార్దిక్ పటేల్ తోపాటు ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్తోపాటు సర్దార్ పటేల్ వర్గం నేత లాల్జీ పటేల్, ఏకే పటేల్ను కూడా దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది.
కోర్టు తీర్పు వెలువరించే ముందే తన మద్దతు దారులతో హార్దిక్ పటేల్ సమావేశమయ్యారు. తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా.. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేపట్టకూడదని వాళ్లకు చెప్పారు.
2015లో పటీదార్ ఉద్యమ సమయంలో 3 వేల నుంచి 5 వేల మంది ఉద్యమకారులు బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ పటేల్ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి హార్దిక్తోపాటు మరో 17 మందిపై నేరపూరిత కుట్ర, దాడి, అల్లర్ల కేసులను నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే హార్దిక్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్పై ఆయన విడుదలయ్యారు. ఆయనను మెహసానా జిల్లాలోకి అడుగుపెట్టకుండా కోర్టు నిషేధం విధించింది.