అయిదుగుర్ని కనండి,ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 12:48 PM

అయిదుగుర్ని కనండి,ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు

బాలియా: ఐదుగురి పిల్లల్ని కనండి హిందు మతాన్ని పెంచండి అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్ప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలియా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే హిందువులు జనాభాను పెంచాలన్నారు. హిందువు జంటలు ప్రతి ఒక్కరూ అయిదుగుర్ని కనాలని ప్రతి ఆధ్మాతిక గురువు భావిస్తుంటారని, ఈరకంగానైనా జనాభాతో హిందూ ధర్మాన్ని రక్షించుకోవచ్చు అని అన్నారు.

పెరుగుతున్న అత్యాచారాలను రాముడు కూడా నియంత్రించలేరని ఇటీవల ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఓ కామెంట్ చేశారు. అత్యాచారం సహజ కాలుష్యమని, ప్రతి ఒక్కర్నీ తమ కుటుంబంగా, సోదరిగా భావించాలని, విలువల ద్వారానే అత్యాచారాలను నియంత్రించ వచ్చు అని, రాజ్యాంగం ద్వారా కాదు అని ఎమ్మెల్యే అన్నారు.





Untitled Document
Advertisements