మహేశ్‌, సచిన్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ ఇదే!!

     Written by : smtv Desk | Fri, Jul 27, 2018, 05:31 PM

మహేశ్‌, సచిన్‌కు కేటీఆర్‌  ఛాలెంజ్‌ ఇదే!!

హైదరాబాద్‌, జూలై 27: హరిత సవాల్ కార్యక్రమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విసిరిన సవాల్‌ను స్వీకరించిన పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఐదుగురు ప్రముఖులకు హరిత సవాల్ విసిరారు.

రాజమౌళి సవాల్‌కు స్పందించిన కేటీఆర్... గురువారం టీశాట్ ఆవరణలో నాలుగు మొక్కలు నాటారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపిన మంత్రి... సినీనటుడు మహేష్ బాబు, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయికి హరిత సవాల్ విసిరారు. ఒక్కొక్కరు నాలుగు చొప్పున మొక్కలు నాటాలని కేటీఆర్ కోరారు.





Untitled Document
Advertisements