హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నార్త్,సెంట్రల్ జోన్ల పరిధిలలోని అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
ఆదివారం ఉదయం 6గంటల నుంచి ఈ నెల 31న ఉదయం 6గంటల వరకు వీటిని మూసివేయాలని స్పష్టం చేశారు.అలాగే మహంకాళి దేవాలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇందుకు వాహనదారులు సహకరించాలని వారు కోరారు.