చెన్నై: గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరామర్శించారు. చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రికి వెళ్లిన రాష్ట్రపతి.. కరుణానిధి ఆరోగ్యంపై ఆయన తనయుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతితో పాటు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉన్నారు.