అనంతపురం: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అనంత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా జేఎన్టీయూ ప్రాంగణంలోని ఐటీ ఇంకుబేషన్ భవనంలో సెంట్రల్ యూనివర్సిటీ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా, కాల్వ , పరిటాల సునీత, యూనివర్శిటి రిజిస్ట్రార్ అప్పారావు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం విద్యార్థులతో ప్రకాశ్ జవడేకర్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా.. ప్రకాశ్ జవడేకర్ను ప్రత్యేక హోదాపై ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. అయితే ఆయన్నుంచి ఏం సమాధానం వచ్చిందా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. ముఖాముఖిలో విద్యార్థులు కూడా కేంద్ర మంత్రిపై హోదా గురించి ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది.